జమ్మూ కశ్మీర్లో రెండు వేర్వేరు చోట్ల ఎన్ కౌంటర్లు జరిగాయి. కుల్గామ్ ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ లోని బెమిన ఏరియాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఓ టెర్రరిస్ట్ హతం అయ్యాడు. ఘటనా స్థలంలో భారీగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నా యి భద్రతాబలగాలు. టెర్రర్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది.
కుల్గామ్ ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు టెర్రరిస్టుల్లో ఒకడు కుల్గాం జిల్లా హిజ్బుల్ మొజాహిద్దీన్ కమాండర్ సిరాజ్ మోల్వీ అని, మరో హిజ్బుల్ టెర్రరిస్ట్ యావర్ భట్ అని కశ్మీర్ పోలీసులు గుర్తించారు. 2016 నుంచి సిరాజ్ ఈ జోన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ, యువతను టెర్రరిస్టులుగా రిక్రూట్ చేసుకోవడంలో క్రియాశీలంగా ఉన్నాడని, ఇతడు పలువురు సామాన్య పౌరులను చంపాడని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు. సిరాజ్ను హతమార్చడం పెద్ద విజయమని అన్నారు. అయితే బెమిన ఏరియాలో హతమైన టెర్రరిస్ట్ ఐడెంటిటీ తెలియాల్సి ఉంది.