తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకుందాం : హనుమండ్ల ఝాన్సీ రెడ్డి

తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకుందాం : హనుమండ్ల ఝాన్సీ రెడ్డి

రాయపర్తి, వెలుగు: తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుందామని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్​చార్జి హనుమండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల, పెర్కవేడు, ఊకల్ గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో అత్యధికంగా ఎంపీ అభ్యర్థులను గెలిపించి ఆమెకు కానుకగా ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు అమ్యా నాయక్, పార్టీ మండలాధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.