కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి  అధికారంలోకి వచ్చింది: కేటీఆర్

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి  అధికారంలోకి వచ్చింది: కేటీఆర్

కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి  అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మోచేతికి బెల్లంపెట్టి మోసపూరిత హామీలతో గెలిచిందన్నారు.  ఆరు గ్యారంటీల్లో  ఒక్కటి అమలు చేసి  మగవాళ్లకు,  మహిళలకు తాకులాట పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం పోయాకా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చిందన్నారు.

సిరిసిల్లలో వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం చేసిన కేటీఆర్.. ఈ ఐదేళ్లలో ఒక్క రూపాయి మందుపంచలేదన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లనే అని అన్నారు.    సిరిసిల్ల పట్టణం అతి సుందరంగా తీర్చి దిద్దుకున్నామని చెప్పారు. కేసీఆర్ మల్ల కావాలంటే 13 తేదీన కారు గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణలో శాసించే అధికారం వస్తుందన్నారు.  సిరిసిల్లలో అనేక అభివృద్ధి పనులు చేసినా..  బీజేపీ ఒక్క పని చేసిందా  అని ప్రశ్నించారు. మోదీ మళ్లీ అప్ కీ బార్ 420 అంటున్నారు అక్కరికి రానీ సుట్టాలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.