అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌పై దాడి

అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌పై దాడి

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం అర్ధరాత్రి బిజెపి కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలైయ్యాయి. ఆఫీస్ లోపల పార్కింగ్ ప్లేస్ లో ఉన్న కార్లను సైతం కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం అయ్యాయి.  

పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం అమేథీలోని రాయ్‌బరేలీలో ప్రచారం స్టార్ట్ చేయనున్నారు. దానికి ముందే ఈ సంఘటన జరిగింది. రాయ్‌బరేలీ, అమేథీలకు మే 20న ఎన్నికలు జరగనున్నాయి.  అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై కిషోరి లాల్ శర్మ పోటీ చేశారు.