మమతకు ఝలక్..బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

మమతకు ఝలక్..బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు  టీఎంసీకి చెందిన 50 మందికి పైగా కౌన్సిలర్లు బీజేపీలో చేరారు.  వీరితో పాటు సీపీఎం కు చెందిన మరో ఎమ్మెల్యే కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీఎంసీ బహిష్కృత నేత, ముకుల్‌రాయ్ తనయుడు సుభ్రాన్షు  రాయ్, మరో టీఎంసీ అసమ్మతి ఎమ్మెల్యే తుషర్కన్తి భట్టాచార్జీ , సీపీఎం ఎమ్మెల్యే దేవేంద్ర రాయ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరారు. ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరిగినట్లు పశ్చిమ బెంగాల్ లో కూడా ఏడు విడతల్లో బీజేపీలోకి చేరికలు ఉంటాయని అన్నారు కైలాష్ విజయవర్గీయ.