ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. 20 పూరిళ్లు దగ్ధం

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. 20 పూరిళ్లు దగ్ధం

ఏపీలోని విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెంటాడ మండలం జక్కువలసలోని ఓ ఇంట్లో నిన్న రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి.  క్రమంగా మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించాయి. ఇళ్లలోని గ్యాస్  సిలిండర్లు పేలడంతో స్థానికులు  తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో  20 పూరిళ్లు కాలిపోయ్యాయి. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామని జిల్లా కలెక్టర్  సూర్యకుమారి తెలిపారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు  స్థానిక పాఠశాలలో వసతి కల్పిస్తున్నట్టు చెప్పారు.