
ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ఈ ఏడాది ఇండియాలో 20 వేల మందికి పైగా స్టూడెంట్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఇంజనీరింగ్ , సైన్స్ గ్రాడ్యుయేట్ల నియామకాలను 30 శాతం పెంచాలని నిర్ణయించినట్టు కంపెనీ సీఈవో బ్రియాన్హం ఫ్రీస్ చెప్పారు. జీతాలను కూడా 18శాతం పెంచి ఏడాదికి రూ.4 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. కాగా,కాగ్నిజెంట్ 2019 జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో గ్లోబల్గా 10 వేల నుంచి 12 వేలమందిని తీసేసినట్టు ప్రకటించింది.