ఐపీఎల్ సీజన్ లో నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్స్.. రికార్డ్ బద్దలు కొట్టిన స్విగ్గీ

ఐపీఎల్ సీజన్ లో నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్స్.. రికార్డ్ బద్దలు కొట్టిన స్విగ్గీ

మే 29న జరిగిన ఐపీఎల్ 2023లో చివరి బంతికి గుజరాత్ టైటాన్స్ ను ఓడించి, చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ రికార్డు సృష్టించింది. ఈ ఐపీఎల్ సీజన్ లో మొత్తం 12మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని స్విగ్గీ వెల్లడించింది. అందులో ముఖ్యంగా ఎక్కువ ఆర్డర్స్ వచ్చింది బిర్యానీకేనని తెలిపింది. ఈ సీజన్ లో స్విగ్గీకి నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొంది.

ఫుడ్ డెలివరీ యాప్స్ లలో ఒకటైన స్విగ్గీ ఇప్పటికే పలు రికార్డులు సృష్టించగా.. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఐపీఎల్ పుణ్యమా అని బిర్యానీ వెంట పడ్డారు. ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్స్ లలో కస్టమర్స్ ఎక్కువగా ఆర్డర్ చేసే, ఇష్టపడే వంటకాలైన చికెన్ బిర్యానీ, బటర్ నాన్, మసాలా దోసాల ఆర్డర్ లు స్విగ్గీలో 30శాతం పెరిగాయి. 

https://twitter.com/Swiggy/status/1663191294901116929