జడ్చర్ల టౌన్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని మయూరి పార్కు వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు బోల్తా పడ డంతో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. సోమవారం ఉదయం మౌంట్ బేసిల్ స్కూల్కు చెందిన బస్సు గంగాపూర్, జడ్చర్ల నుంచి స్టూడెంట్లను ఎక్కించుకొని 167వ నెంబర్ జాతీయ రహదారిపై నుంచి బడి సమీపంలోకి వచ్చింది. స్కూల్లోకి వెళ్లేందుకు డివైడర్ వద్ద టర్న్ తీసుకుంటుండగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.
దీంతో బస్సు బోల్తా పడగా 25 మంది పిల్లలు గాయపడ్డారు. బస్సు క్లీనర్ కాలు విరిగింది. ఆ సమయంలో అటుగా వస్తున్న వాహనదారులు చిన్నారులను బస్సులోంచి బయటకు లాగి కాపాడారు. గాయపడిన వారిని మహబూబ్నగర్లోని ఎస్వీఎస్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్కు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బస్సు ఓవర్స్పీడ్గా నడపడం కూడా ప్రమాదానికి కారణమైందని పిల్లలు చెబుతున్నారు.