ప్రైవేట్​ స్కూల్ బస్సు బోల్తా.. 25 మంది స్టూడెంట్లకు గాయాలు

ప్రైవేట్​ స్కూల్ బస్సు బోల్తా.. 25 మంది స్టూడెంట్లకు గాయాలు

జడ్చర్ల టౌన్​, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రం సమీపంలోని మయూరి పార్కు వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్​ స్కూల్​ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు బోల్తా పడ డంతో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. సోమవారం ఉదయం మౌంట్​ బేసిల్​ స్కూల్​కు చెందిన బస్సు గంగాపూర్, జడ్చర్ల నుంచి స్టూడెంట్లను ఎక్కించుకొని 167వ నెంబర్​ జాతీయ రహదారిపై నుంచి బడి సమీపంలోకి వచ్చింది. స్కూల్​లోకి వెళ్లేందుకు డివైడర్​ వద్ద టర్న్​ తీసుకుంటుండగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. 

దీంతో బస్సు బోల్తా పడగా 25 మంది పిల్లలు గాయపడ్డారు. బస్సు క్లీనర్ కాలు విరిగింది. ఆ సమయంలో అటుగా వస్తున్న వాహనదారులు చిన్నారులను బస్సులోంచి బయటకు లాగి కాపాడారు. గాయపడిన వారిని మహబూబ్​నగర్​లోని ఎస్వీఎస్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్​కు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బస్సు ఓవర్​స్పీడ్​గా నడపడం కూడా ప్రమాదానికి కారణమైందని పిల్లలు చెబుతున్నారు.