ప్రేమించిన అమ్మాయి దక్కదని పెండ్లికొడుకు హత్య

ప్రేమించిన అమ్మాయి దక్కదని పెండ్లికొడుకు హత్య
  • ముగ్గురు నిందితుల అరెస్టు

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెండ్లి చేసుకోవడం భరించలేక పెండ్లి కొడుకును హత్య చేశాడు. అక్టోబర్ 30న హత్య జరగగా మంగళవారం నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్ పట్టణానికి చెందిన గుర్రాల హరీశ్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన ఓ యువతితో నాలుగేండ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో హరీశ్​రెడ్డి తల్లిదండ్రులు వారి పెండ్లికి ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయి కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన పైడి రాజశేఖర్(26)ను పెండ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. దీంతో హరీశ్ ఎలాగైనా రాజశేఖర్​ను చంపాలని కుట్ర పన్నాడు.

అక్టోబర్ 29న తన ఫ్రెండ్​సింగసారం నాగరాజుతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లాల్సి ఉందని డ్రైవర్ గా చేసే రాజశేఖర్ ను పిలిచాడు. హుస్నాబాద్ లో చాకులు, గ్లౌజులు కొన్నారు. బద్దిపడగ వద్ద రాజశేఖర్​ను ఒకరు గట్టిగా పట్టుకోగా, మరొకరు చాకుతో అతని గొంతు, చాతీపై పొడిచి చంపారు. అనంతరం అక్కడి నుంచి కొద్దిదూరం వెళ్లి మరో ఫ్రెండ్​శివకు ఫోన్​చేసి పిలిపించారు. అతడి బైక్​పై హుస్నాబాద్​వెళుతూ బస్వాపూర్ వాగులో కత్తులను, గ్లౌజులను పడేశారు. కేసు విచారించిన పోలీసులు మంగళవారం ఉదయం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.