భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బీఆర్ఎస్హయాంలో చేసిన పాపాలను కడిగేసుకొని కవిత పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాలని జనసేన జనరల్ సెక్రటరీ రాం తాళ్లూరి పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాం తాళ్లూరి మాట్లాడుతూ కేసీఆర్హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కవిత పేర్కొంటున్నారని, ఆ అవినీతిలో ఆమెకూ భాగస్వామ్యం ఉందన్నారు.
ఇప్పుడేమో టీఆర్ఎస్పేర కవిత ఆ అవినీతి మురికి అంటించుకుంటున్నారని విమర్శించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానానికి జనసేన నుంచి గడల శ్రీనివాస్, తాను ఖమ్మం పార్లమెంట్కు పోటీ చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు శంకర్గౌడ్, ఆర్కే సాగర్, సుధాకర్, సతీశ్రెడ్డి, నరేశ్రెడ్డి, హసీనా, రవీందర్, లిఖిత, శ్రీనివాస్ పాల్గొన్నారు.
