భద్రాచలం, వెలుగు : మావోయిస్టులకు చెందిన డంప్ ను ఛత్తీస్గఢ్రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఆదివారం భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎస్పీ గౌరవ్రాయ్తెలిపిన వివరాల ప్రకారం... దంతెవాడ జిల్లాలోని బార్సూర్పోలీస్స్టేషన్ పరిధిలో తోడ్మా గ్రామ అడవుల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు గుట్టల్లో దాచిన డంప్ను గుర్తించారు.
116 గ్రాముల బంగారం, రూ. 2 లక్షలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పాటు 12 బోర్ తుపాకులు 5, తూటాలు, బీజీఎల్ లాంచర్లు 3, బీజీఎల్సెల్స్, కార్బన్మేగజైన్లు 2, 303 రౌండ్లు, 303 చార్జర్లు, టిఫిన్బాక్స్ బాంబులు 6, పైపు బాంబులు 4, బాణం బాంబులు 22, దేశీ గ్రైనేడ్లు 2, దేశీ మోర్టార్లు 2, డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్, 14 కుక్కర్బాంబులు, ఇన్సాస్ రైఫిల్స్, మేగజైన్లు, ఏకే -47 మేగజైన్లు, ఎస్ఎల్ఆర్మేగజైన్లు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని దంతెవాడకు
తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.
