
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్షేషనే. ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో ఏపీ రాజకీయాల్లో వివాదం రేపిన వర్మ. లేటెస్ట్ గా కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. 28 న రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ రికార్డ్ సృష్టిస్తుంది. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 3.4 మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్, కేఏ పాల్ లను టార్గెట్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ వివాదాస్పదంగా మారింది. ఈ మూవీపై ఇప్పటికే ఏపీలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి.