ప్రజావాణి కార్యక్రమంలో ఉద్రిక్తత

ప్రజావాణి కార్యక్రమంలో ఉద్రిక్తత

కరీంనగర్ జిల్లా కలెక్టరెట్ దగ్గర జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దళితబంధు లబ్ధిదారుల లిస్టులో తమ పేర్లు లేవంటూ బాధితులు ఆందోళనకు దిగారు. పురుగుల మందు డబ్బాలు పట్టుకొని కలెక్టరేట్ ఆడిటోరియం ముందు బైఠాయించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో 17వేల మంది లబ్ధిదారులకు దళితబంధు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 10 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు వందమందికి పైగా బాధితులు నిరసన వ్యక్తం చేశారు.