
- సైబరాబాద్ ట్రాఫిక్ పీఎస్ లిమిట్స్ లో నమోదు
- మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిలో యువతే ఎక్కువ
- 253 బైక్లు, 16 ఆటోలు,74 కార్లు, 6 హెవీ వెహికల్స్ స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు : మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని చెబుతున్నా మందుబాబులు మాత్రం మారడం లేదు. పబ్లు, బార్లు, వైన్సుల్లో మద్యం తాగి డ్రంకెన్ డ్రైవ్ లు చేస్తూనే ఉన్నారు. సైబరాబాద్ట్రాఫిక్ పోలీసులు ఈనెల 15న సాయంత్రం 6.30 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్లో 349 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరిలో 3 యువతులు ఉన్నారు. ఎక్కువగా మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ లిమిట్స్లోనే 74 మంది దొరికారు. తక్కువగా అల్వాల్ట్రాఫిక్ పీఎస్ లిమిట్స్లో ఏడుగురు చిక్కారు.
253 బైకులు,16 ఆటోలు, 74 కార్లు, 6 హెవీ వెహికల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో చిక్కిన వారిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో 21 –30 ఏండ్లలోపు వారు 172 మంది, 31 –40 ఏండ్లలోపు వారు 104 మంది ఉన్నారు. సిటీలో రోడ్డు ప్రమాదాలు, మరణాలకు డ్రంకెన్ డ్రైవ్ ప్రధాన కారణమని సైబరాబాద్ట్రాఫిక్జాయింట్కమిషనర్జోయెల్డేవిస్తెలిపారు. లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.