
- మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘటన
జడ్చర్ల, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్ వద్ద దొంగలు ఓ ప్రయాణికుడి నుంచి రూ.36 లక్షలు ఎత్తుకుపోయారు. హైదరాబాద్లోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగి దామోదర్ మంగళవారం కర్నూల్లో ఉంటున్న తన చెల్లికి రూ.36 లక్షలు నగదు ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్ లో బయలుదేరాడు.
జడ్చర్ల బస్టాండ్లో టీ తాగి వచ్చిన తర్వాత బ్యాగులో చూడగా డబ్బులు కనిపించలేదు. వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా బస్టాండ్ పరిసరాల్లో అనుమానితులను విచారించారు. సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ ఆదిరెడ్డి తెలిపారు. కర్నూల్లో ఉంటున్న చెల్లెలికి అత్యవసరం ఉండడంతో పీఎఫ్ నుంచి రూ. 29 లక్షలు తీసుకొని, రూ.7 లక్షలు బయట సమకూర్చుకొని తీసుకెళ్తుండగా, ఇలా జరిగిందని బాధితుడు దామోదర్ వాపోయాడు.