ఆర్టీసీ బస్సులో రూ.36 లక్షలు చోరీ

ఆర్టీసీ బస్సులో రూ.36 లక్షలు చోరీ
  • మహబూబ్​నగర్​ జిల్లా  జడ్చర్లలో ఘటన​

జడ్చర్ల, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్​ వద్ద దొంగలు ఓ ప్రయాణికుడి నుంచి రూ.36 లక్షలు ఎత్తుకుపోయారు. హైదరాబాద్​లోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్​ ఉద్యోగి దామోదర్​ మంగళవారం కర్నూల్​లో ఉంటున్న తన చెల్లికి రూ.36 లక్షలు నగదు ఇచ్చేందుకు హైదరాబాద్​ నుంచి ఆర్టీసీ బస్ లో బయలుదేరాడు.

జడ్చర్ల బస్టాండ్​లో టీ తాగి వచ్చిన తర్వాత బ్యాగులో చూడగా డబ్బులు కనిపించలేదు. వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా బస్టాండ్​ పరిసరాల్లో అనుమానితులను విచారించారు. సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ ఆదిరెడ్డి తెలిపారు. కర్నూల్​లో ఉంటున్న చెల్లెలికి అత్యవసరం ఉండడంతో పీఎఫ్  నుంచి రూ. 29 లక్షలు తీసుకొని, రూ.7 లక్షలు బయట సమకూర్చుకొని తీసుకెళ్తుండగా, ఇలా జరిగిందని బాధితుడు దామోదర్  వాపోయాడు.