ఏపీలో ఒక్కరోజులో 3963 కేసులు

ఏపీలో ఒక్కరోజులో 3963 కేసులు
  • మొత్తం 44,609కి చేరిన కేసులు
  •  24 గంటల్లో 52 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. టెస్టులు చేస్తున్న కొద్ది కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3963 కేసులు నమోదైనట్లు అధికారులు హెల్త్ బెలిటెన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 44,609కి చేరింది. 24 గంటల్లో వ్యాధి బారిన పడి 52 మంది చనిపోయారు. దీంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 589కి చేరింది. చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. కాగా ఇప్పటి వరకు 21,763 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. 22,260 మంది వివిధ హస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఒక్క రోజులో 23,872 శ్యాంపిల్స్‌ను పరీక్షించారు.