దోస్త్ స్పెషల్ ఫేజ్​లో 39వేల 969మందికి సీట్లు

దోస్త్ స్పెషల్ ఫేజ్​లో 39వేల 969మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: డిగ్రీ అడ్మిషన్ల కోసం నిర్వహించిన దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్​లో 39,969 మందికి సీట్లు కేటాయించినట్లు హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మొత్తం వెబ్ ఆప్షన్లు 41,851 మంది ఇవ్వగా, దాంట్లో తక్కువ ఆప్షన్లు ఇచ్చిన 1,882 మందికి సీట్లు అలాట్ కాలేదని ఆయన చెప్పారు. 

సీట్లు పొందిన వారిలో 34వేల మంది ఫస్ట్ ప్రయార్టీ కాలేజీలోనే సీట్లు పొందినట్టు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు  21 దాకా ఆన్ లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.