జవాన్లపై కాల్పులు జరిపిన తోటి జవాన్

జవాన్లపై కాల్పులు జరిపిన తోటి జవాన్

ఛత్తీస్‎గఢ్ సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మిలటరీ బేస్ క్యాంప్‎లో జవాన్ల మధ్య గొడవ జరిగింది. మారాయిగూడ పోలీస్‎స్టేషన్ లిమిట్స్‎లోని లింగాలపల్లిలో ఉన్న సీఆర్‎పీఎఫ్ క్యాంప్‎లో ఓ జవాన్ కాల్పులకు దిగి.. తోటి జవాన్లనే కాల్చి చంపాడు. తెల్లవారుజామున 3.25 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో సీఆర్‎పీఎఫ్ 50వ బెటాలియన్‎కు చెందిన నలుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే భద్రాచాలం ఏరియా హాస్పిటల్‎కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చనిపోయినవారిని ధాంజీ, రజీబ్ మొండల్, రాజ్ మణి, కుమార్ యాదవ్‎లుగా గుర్తించారు. ఘటనపై సీఆర్‎పీఎఫ్  అధికారులతో పాటు... లోకల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జవాన్ అలా రెచ్చిపోయి కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు.