న్యూఢిల్లీ: సోమవారం సుప్రీంకోర్టులో కొత్తగా నలుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పంజాబ్ & హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కృష్ణ మురారి, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్. రవీంద్ర భట్, హిమచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిషికేశ్ రాయ్ ఉన్నారు. వీరితో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31 నుంచి 34 కు పెరిగింది.

