- టోక్యో ఒలింపిక్స్లో ఫేవరెట్గా మన్ప్రీత్ సేన
హైదరాబాద్: ఎనిమిది గోల్డ్, ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్.. ఒలింపిక్ గేమ్స్లో ఇండియా మెన్స్ హాకీ టీమ్ ఘన చరిత్ర ఇది. ఇంతటి ఘన కీర్తి ఉన్నా.. ఒలింపిక్ మెడల్ వేటలో ఇండియా చాలా కాలంగా వెనుకబడింది. 1980 మాస్కో గేమ్స్లో చివరిసారి గోల్డ్ మెడల్ సాధించిన ఇండియా 40 ఏళ్లుగా పోడియం ఎక్కలేకపోయింది. ఆ గతాన్ని చెరిపేయడమే లక్ష్యంగా ఇండియా మెన్స్ హాకీ టీమ్ టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగుతోంది. 1964లో జపాన్ వేదికగా జరిగిన గేమ్స్లో ఇండియా గోల్డ్ మెడల్ గెలిచింది. దీంతో ఈసారి హిస్టరీ రిపీట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా జట్టు నాలుగేళ్లుగా చేస్తున్న పెర్ఫామెన్స్లు కూడా ఇందుకు కారణం. 2017 ఆసియా కప్ గెలిచిన ఇండియా 2018లో ఏషియన్ చాంపియన్షిప్స్ ట్రోఫీ సాధించింది. 2019 ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్లోనూ గెలిచింది. అంతేకాక 2018 వరల్డ్కప్లో క్వార్టర్ ఫైనల్కు వచ్చింది. దీంతో టోక్యోలో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. జట్టుగా ఇండియా చాలా బలంగా ఉంది. కానీ మెగా ఈవెంట్కు ఎంపికైన 16 మంది ప్లేయర్లలో 10 మందికి ఇదే తొలి ఒలింపిక్స్ కావడం బలహీనతగా చెప్పొచ్చు. దీంతో కెరీర్లో మూడో సారి ఒలింపిక్స్ ఆడుతున్న కెప్టెన్ మన్ప్రీత్తోపాటు సీనియర్లు రూపిందర్ పాల్, సురేందర్ కుమార్, మన్దీప్ సింగ్.. జూనియర్లను గైడ్ చెయ్యాల్సి ఉంది. జూనియర్లు ప్రెజర్ను అధిగమిస్తే ఇండియా అంచనాలను అందుకోవడం దాదాపు ఖాయం. ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్పెయిన్, జపాన్తో కలిసి ఇండియా పూల్–ఎలో ఉంది.