హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 14 జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా రికార్డు కాగా.. మిగతా జిల్లాల్లో 38 డిగ్రీల నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నల్గొండలో 40.9 డిగ్రీలు, సిద్దిపేటలో 40.8, నిజామాబాద్ 40.7, ఆదిలాబాద్ 40.5, జగిత్యాల 40.5, నిర్మల్ 40.4, ఖమ్మం 40.4, వనపర్తి 40.3, సూర్యాపేట 40.1, హైదరాబాద్ 40.1, మేడ్చల్ మల్కాజిగిరి 40.1, మంచిర్యాల 40.1, రాజన్న సిరిసిల్ల 40 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, హనుమకొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది.