
- రైతులకు రూ.10,547 కోట్లు చెల్లింపు
- ముగిసిన వడ్ల కొనుగోళ్లు
హైదరాబాద్, వెలుగు: సివిల్సప్లయ్స్డిపార్ట్మెంట్యాసంగిలో 48 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందుకు సంబంధించి రైతులకు రూ.10,547 కోట్లు చెల్లింపులు చేసింది. గడిచిన యాసంగిలో 75.40 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్ల అంచనాతో సివిల్ సప్లయ్స్7,178 సెంటర్లు ఓపెన్ చేసింది. ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే చెల్లింపులు పూర్తిచేసింది.
మొత్తం 8,99,546 మంది రైతుల ఖాతాల్లో రూ.10,547 కోట్లు జమ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో సివిల్ సప్లయ్స్ విభాగం ధాన్యం అమ్మిన రైతులందరికీ 3 రోజుల్లోనే డబ్బులు చెల్లించి రికార్డు నెలకొల్పింది. ఈసారి 2--–3 వారాల ముందే కొనుగోళ్లు షురూ చేయడంతో పాటు టైమ్కు డబ్బులు అందించింది. గతంలో ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం తిరిగి ఇవ్వకుండా బకాయి పడ్డ మిల్లర్లకు ప్రభుత్వం ఈసారి ధాన్యం కేటాయించలేదు.