పంట తింటున్నాయని కోతులకు మందు..50కిపైగా మృతి

పంట తింటున్నాయని కోతులకు మందు..50కిపైగా మృతి

తిరుమల, వెలుగు: కోతులు పంటను దెబ్బతీస్తున్నాయన్న కోపంతో ఓ రైతు దారుణానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా కుప్పం మండపంలోని కంగొందికి చెందిన ఓ రైతు అంగన్​వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో పురుగుల మందు కలిపి పొలంలో చల్లాడు, ఆ ఆహారాన్ని తిని 50కి పైగా  కోతులు చనిపోయాయి. మందు కలిపిన ఆహారాన్ని తిన్న కోతులు అరగంటలోనే చనిపోయాయి. పొలమంతటా కోతుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. స్థానికులు కొన్నింటిని పూడ్చిపెట్టారు. మూగజీవాలను విషం పెట్టి చంపడంపై ప్థానికులుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు