ఘోర రోడ్డు ప్రమాదం.. 53 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 53 మంది మృతి

చియోపాస్: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చియాపాస్‌లో వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు ఫుట్ పాత్ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 53 మంది మృతి చెందగా.. 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. బాధితులు సెంట్రల్ అమెరికాకు చెందిన వారని తెలుస్తోంది. గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్‌లో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. వేగంగా ఉన్న వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటు చేసుకుందన్నారు. కాగా.. చనిపోయిన వాళ్లు వలస కార్మికులని అధికారులు వెల్లడించారు. సరైన ధృవపత్రాలు లేకుండా సెంట్రల్ అమెరికా నుంచి అక్రమంగా వస్తున్నారని తెలిపారు.