దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు ప్రతి రోజు దాదాపు 70 వేలకు పైగా కేసులు నమోదయ్యేవి.. కానీ గడిచిన 24 గంటల్లో 55,342 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంత మొత్తంలో కేసులు తగ్గడం ఇదే మొదటి సారి. కరోనా మరణాలు కూడా తగ్గాయి. నిన్న 706 మంది చనిపోయారు. వీటితో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 71,75,881 కి చేరగా.. మరణాల సంఖ్య1,09,856 కు చేరింది.నిన్నఒక్కరోజే 77,760 మంది కోలుకున్నారు.దీంతో దేశంలో నిన్నటి వరకు 62,27,296 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 8,38,729 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించి. ఇక నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 10,73,014 మందికి టెస్టులు చేశారు. దీంతో దేశంలో అక్టోబర్ 12 నాటికి కరోనా టెస్టుల సంఖ్య 8 కోట్ల 89 లక్షల45 వేల107 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.
India reports a spike of 55,342 new #COVID19 cases & 706 deaths in the last 24 hours.
Total case tally stands at 71,75,881 including 8,38,729 active cases, 62,27,296 cured/discharged/migrated cases & 1,09,856 deaths: Union Health Ministry pic.twitter.com/XRVq730KDG
— ANI (@ANI) October 13, 2020