వచ్చే ఏడాది నుంచి కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు తప్పనిసరి

వచ్చే ఏడాది నుంచి కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు తప్పనిసరి

కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు ఉండాలన్న నియమాన్ని అక్టోబర్ 1, 2023 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కంపెనీలు తప్పనిసరిగా ఈ రూల్ను పాటించాలని ఆయన ట్వీట్ చేశారు. ఈ అక్టోబర్ నుంచే ఈ రూల్ను అమలు చేయాలని కేంద్రం అనుకున్నప్పటికీ ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు గడ్కరీ తెలిపారు.

ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా దీనిని అమలుచేయాలన్న గడ్కరీ.. మోటారు వాహనాల్లో ప్రయాణించే వారి భద్రతే తమకు ప్రాధాన్యమని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు ఏర్పాటు చేయాలని ఈ ఏడాది జనవరిలో కేంద్రం డ్రాఫ్ట్  నోటిఫికేషన్ జారీ చేసింది.