బాల్కనీ నుంచి కిందపడి ఆరేళ్ల బాలుడు మృతి

బాల్కనీ నుంచి కిందపడి ఆరేళ్ల బాలుడు మృతి
  •               అమ్మ అన్నం తినిపిస్తుండగా విషాదం

అప్పటి వరకు అమ్మ చేతి గోరు ముద్దలు తిన్న ఆరేళ్ల బాలుడు.. ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కిందపడి చనిపోయాడు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పైప్​లైన్​రోడ్డులోని లక్ష్మీగంగా ఎన్​క్లేవ్​కి చెందిన  నితిన్​రెడ్డి కుమారుడు శ్రీహన్​రెడ్డి (6)  ప్లే స్కూల్​లో చదువుతున్నాడు. ఆదివారం తల్లితో కలిసి జీడిమెట్లలోని బీమ్​ప్రైమ్​ ఆపార్ట్​ మెంటులో ఉంటున్న  మామ ఇంటికి వెళ్లాడు.  సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో  బాల్కనీలో కొడుకు శ్రీహన్ రెడ్డికి తల్లి భోజనం పెడుతోంది. మంచినీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలో బాల్కనీలోని రెయిలింగ్​ఎక్కుతూ బాలుడు అదుపు తప్పి మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఘటనపై  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.