- అమ్మ అన్నం తినిపిస్తుండగా విషాదం
అప్పటి వరకు అమ్మ చేతి గోరు ముద్దలు తిన్న ఆరేళ్ల బాలుడు.. ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కిందపడి చనిపోయాడు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పైప్లైన్రోడ్డులోని లక్ష్మీగంగా ఎన్క్లేవ్కి చెందిన నితిన్రెడ్డి కుమారుడు శ్రీహన్రెడ్డి (6) ప్లే స్కూల్లో చదువుతున్నాడు. ఆదివారం తల్లితో కలిసి జీడిమెట్లలోని బీమ్ప్రైమ్ ఆపార్ట్ మెంటులో ఉంటున్న మామ ఇంటికి వెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాల్కనీలో కొడుకు శ్రీహన్ రెడ్డికి తల్లి భోజనం పెడుతోంది. మంచినీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలో బాల్కనీలోని రెయిలింగ్ఎక్కుతూ బాలుడు అదుపు తప్పి మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.