స్కూటర్ పై ఆరుగురు పోకిరీల హంగామా

స్కూటర్ పై ఆరుగురు పోకిరీల హంగామా

పోకిరి పోరగాళ్లు స్కూటర్ పై చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. ఆరుగురు ఒకే స్కూటర్ పై కేకలు వేస్తూ వెళ్లారు. ట్రాఫిక్‌ రూల్స్ బ్రేక్ చేసి ఒకే స్కూటర్‌పై ఆరుగురు వెళ్తున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ వీడియోలో ఒకే స్కూట‌ర్ పై ఆరుగురు ఎక్కారు. దీనికి తోడు రోడ్డుపై విన్యాసాలు చేస్తూ ఇత‌ర ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌లిగించారు. స్కూట‌ర్ సీటుపై సీటుపై ఐదుగురు అబ్బాయిలు ఉండగా..మరో వ్యక్తి ఓ వ్యక్తి భుజంపై కూర్చున్నాడు.  అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి ఉన్న‌ప్ప‌టికీ.. వారిలో ఒక్కరు కూడా హెల్మెట్ ధ‌రించ‌లేదు. ముంబయిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగా.. అదే మార్గంలో ప్ర‌యాణిస్తున్న రమణదీప్ సింగ్ హోరా అనే వ్యక్తి ఈ దృశ్యాలను ట్వీటర్ లో పోస్టు చేశారు. దీనిని

ముంబ‌యి పోలీస్, పోలీస్ కమిషనర్‌ను ట్యాగ్ చేశారు. ట్రాఫిక్‌ రూల్స్ ను బ్రేక్ చేసి ఒకే స్కూటర్‌పై ఆరుగురు వ్యక్తులు కూర్చున్నారని ట్వీట్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించ‌డంతో పాటు ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగుజేస్తూ.. ప్ర‌మాద‌క‌ర స్థితిలో విన్యాసాలు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. దయచేసి ఇలా ఎవరు చేయకూడదని ట్వీట్ చేశారు. ఈ వీడియోను నిమిషాల్లోనే వేల మంది చూడ‌టంతో వైర‌ల్ అయింది. ముంబ‌యి ట్రాఫిక్ పోలీసులు దీనిపై స్పందించారు. ఆ బైక్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. అంతే కాకుండా ఆ సంఘలన ఏ ప్రదేశంలో జరిగిందో..రమణదీప్ సింగ్ హోరను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు స్పందిస్తూ.. వారిపై సీరియస్ అవుతున్నారు. కొంతమంది చట్టం, నియమాలు, నింబంధనలు పాటించకుండా ఇలాంటి స్టంట్స్‌కి పాల్పడుతూ.. ఇత‌ర ప్ర‌యాణికుల‌ను ప్ర‌మాదంలో ప‌డేస్తున్నార‌ని ట్వీట్లు చేస్తున్నారు.