విశాఖ జిల్లా యలమంచిలి ఎక్సైజ్ పరిధి అడ్డురోడ్డులో అక్రమంగా తరలిస్తున్న 600 కేజీల గంజాయిని ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీలోని సీలేరు నుంచి ముంబయికి ఓ మినీక్యాబ్ వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారంతో మినీ క్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 600 కిలోల గంజాయి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గంజాయిని స్వాధీనం చేసుకొని వాహనం డ్రైవర్ కె.మల్లయ్య, క్లీనరు అబ్దుల్ రహీమ్లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు తప్పించుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్ఫోర్సు సీఐ కామేశ్వరావు తెలిపారు.