మధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిలో చేరిన 70 మంది పిల్లలు

మధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిలో చేరిన 70 మంది పిల్లలు
  • ఆస్పత్రిలో చేరిన 70 మంది పిల్లలు
  •   కర్నాటకలోని స్కూల్​లో ఘటన

బెంగళూరు: కర్నాటక చామరాజనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ స్కూల్​లో మధ్యాహ్న భోజనం తిన్న 70 మంది స్టూడెంట్లు ఆస్పత్రి పాలయ్యారు. సోమవారం లంచ్ టైంలో బల్లి పడిన సాంబారును పిల్లలకు వడ్డించారు. అది తిన్న స్టూడెంట్లకు వాంతులు, కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్​మెంట్ చేయించారు. అయితే, ఎవరికీ అపాయంలేదని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ స్కూల్​ మేనేజ్​మెంట్ పై మండిపడ్డారు. కాగా, సాంబారులో బల్లి పడినట్లు గుర్తించగానే వంటమనిషి అందరినీ అలర్ట్ చేశాడని పబ్లిక్ ఇన్​స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ మంజునాథ్ మీడియాతో చెప్పారు.