
రాయ్పూర్: చత్తీస్గఢ్లో 71 మంది మావోయిస్టులు సరెండర్అయ్యారు. దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ వద్ద లొంగిపోయిన నక్సల్స్ లో 50 మంది పురుషులు, 21మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 30 మందిపై రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గి పోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మావోయిస్టుల ఏరివేతను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేస్తుండడంతో లొంగిపోవడం తప్ప వారికి మరో మార్గం లేదన్నారు. వీరంతా గతంలో అనేక విధ్వంసక సంఘటనలో ప్రత్య క్షంగా పాల్గొన్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని స్థానిక అధికారులు తెలిపారు.