పాట్నా మెడికల్‌ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా 

పాట్నా మెడికల్‌ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ దేశంలోని అన్ని రాష్ట్రాలలో వ్యాప్తి చెందుతోంది. లేటెస్టుగా  పాట్నాలోని నలందా మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిలో పని చేస్తున్న 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా సోకిన  డాక్టర్లకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, వారంతా ఆస్పత్రిలో క్యాంపస్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాట్నా డిస్టిక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ తెలిపారు. ఇటీవల కాలంలో పాట్నాలో జరిగిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కార్యక్రమంలో అనేక మంది డాక్టర్లు  పాల్గొన్నారు. ఇందులో నలందా మెడికల్‌ కాలేజీ డాక్టర్లు  కూడా ఉన్నారు.

 

మరిన్ని వార్తల కోసం..

ఒమిక్రాన్తో టెన్షన్ వద్దు.. వైరస్ బలహీనపడుతోంది