కరెంట్ షాక్ తో 9 ఎద్దులు మృతి

కరెంట్ షాక్ తో 9 ఎద్దులు మృతి

కరెంట్ షాక్ తో మహబూబాబాద్ జిల్లా  చిన్న కిష్టాపురం అడ్డాసుకుంట తండాలో 9 ఎద్దులు చనిపోయాయి. పశువులు మేస్తుండగా తెగి పడి ఉన్న కరెంట్ వైర్ తగిలింది. దీంతో ఆరుగురు రైతులకు చెందిన 9 ఎద్దులు అక్కడికక్కడే  చనిపోయాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రైతులు ఎడ్లు కొట్టుకోవడాన్ని చూసి  వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో రెండు ఎద్దులు ప్రాణాలతో బయటపడ్డాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యే ముందు ఎద్దులు చనిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.