
jపశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పురులియా జిల్లాలో బొలెరో వాహనం ట్రక్కును ఢీ కొట్టింది . ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. వివాహానికి హాజరై వస్తుండగా జూన్ 20న ఉదయం బలరాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నామ్షోల్ సమీపంలోని జాతీయ రహదారి 18పై ఈ ఘటన జరిగింది.
బాధితులు బెంగాల్ లోని పురులియాలోని బారాబజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అడబానా గ్రామం నుంచి జార్ఖండ్లోని నిమ్దిహ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని తిలైతాండ్కు బొలెరో వాహనంలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపు తప్పిన బొలెరో ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. వాహనం పూర్తిగా ధ్వంసం అయ్యింది.
గాయపడిన వాళ్లను స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునే లోపే వాళ్లు మరణించారని వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.