ముంబై: మరో ఆరు రోజుల్లో ఐపీఎల్–2026 సీజన్ మినీ వేలం జరగనున్న వేళ ఆటగాళ్ల ఆక్షన్ లిస్టులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే 350 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ తాజాగా మరో తొమ్మిది మంది పేర్లను వేలం జాబితాలో చేర్చింది. దీంతో వేలంలో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య 359కు చేరుకుంది. బీసీసీఐ కొత్తగా పేర్లు చేర్చిన జాబితాలో ఆరుగురు ఇండియన్ క్రికెటర్స్ ఉండగా.. ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్. మాజీ RCB బ్యాటర్ స్వస్తిక్ చికారా, హైదరాబాద్ ప్లేయర్ చామా మిలింద్ వంటి ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, 2025, డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. 77 స్థానాల కోసం 359 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు.
తొలి సెట్లో ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు. వీరిద్దరి బేస్ప్రైస్ రూ. 75 లక్షలుగా ఉంది. స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, డేవన్ కాన్వే, డేవిడ్ మిల్లర్ రూ. 2 కోట్ల బేస్ప్రైస్తో వేలంలోకి వచ్చారు. డికాక్ (రూ. 1 కోటి) పేరును ఆలస్యంగా చేర్చారు. కోల్కతా రిలీజ్ చేసిన వెంకటేశ్ అయ్యర్ రూ. 2 కోట్ల బేస్ప్రైస్తో అందుబాటులోకి వచ్చాడు. అత్యధికంగా కేకేఆర్ రూ. 64.3 కోట్ల పర్స్తో వేలానికి రానుంది. సీఎస్కే (రూ. 43.4 కోట్లు), హైదరాబాద్ (రూ. 25.5 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
►ALSO READ | భారత క్రికెట్ చరిత్రలో బుమ్రా రేర్ ఫీట్: మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డ్
ఇంగ్లండ్ నుంచి జెమీ స్మిత్, అట్కిన్సన్, లివింగ్స్టోన్, బెన్ డకెట్తో సహా మొత్తం 21 మంది బరిలో ఉన్నారు. ఆసీస్ నుంచి గ్రీన్, ఇంగ్లిస్, షార్ట్, కనోలీ, బ్యూ వెబ్స్టర్ ప్రముఖంగా పోటీపడుతున్నారు. సౌతాఫ్రికా ప్లేయర్లు డికాక్, మిల్లర్, అన్రిచ్, ఎంగిడి, కోయెట్జీ, ముల్డర్.. విండీస్ నుంచి అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, అకీమ్ అగస్టే, షై హోప్, రోస్టన్ ఛేజ్, శ్రీలంక స్పిన్నర్లు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, ట్రావీన్ మాథ్యూ, నిశాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరాపై కూడా దృష్టి నెలకొంది. కివీస్, అఫ్గానిస్తాన్ నుంచి వరుసగా 16, 10 మంది వేలంలో ఉన్నారు.
వేలం జాబితాలో పేర్లు చేర్చబడిన 9 మంది ప్లేయర్స్ వీరే:
- మణిశంకర్ మురాసింగ్
- వీరన్దీప్ సింగ్
- చామా మిలింద్
- కెఎల్ శ్రీజిత్
- ఈథన్ బోష్
- క్రిస్ గ్రీన్
- స్వస్తిక్ చీకారా
- రాహుల్ రాజ్ నామల
- విరాట్ సింగ్

