ఒకే తండా నుంచి 9 మంది స్టాఫ్ నర్సులు

ఒకే తండా నుంచి 9 మంది స్టాఫ్ నర్సులు
  •  సంగారెడ్డి జిల్లా తుర్కపల్లిలో యువతీ యువకుల ఘనత 

నారాయణ్ ఖేడ్, వెలుగు: అదొక తండా.  విద్యకు, వైద్యానికి చాలా దూరం. అక్కడి నుంచి  ఏకంగా తొమ్మిది మంది స్టాఫ్ నర్సులుగా సెలెక్ట్ కావడంతో ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఇటీవల వెలువడిన తెలంగాణ మెడికల్ స్టాఫ్ నర్స్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి తాండకు చెందిన చెందిన విజయ్, వినోద్, రాజు, మోహన్, సంగ్రాం, చైతన్, రజిత, మౌనిక, ప్రియాంక స్టాఫ్ నర్స్ జాబ్ కి సెలెక్ట్ అయ్యారు. స్టాఫ్ నర్సుల కోసం గత ప్రభుత్వం 2022లో నోటిఫికేషన్ వేయగా 2023 ఆగస్టులో వీరు పరీక్ష రాశారు. తొమ్మిది మంది సెలెక్ట్​ కావడంతో తండావాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సెలెక్ట్ అయిన వారిని తుర్కపల్లి సర్పంచ్ స్రవంతి, తండా సర్పంచ్ జెమినీ బాయు అభినందించారు.