శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 957 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. దీన్ని విలువ 46 లక్షల 53 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
804 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇటీవల కాలంలో తరుచుగా బంగారం పట్టుబడుతోంది. నిన్న కూడా అక్రమంగా తరలిస్తున్న 804 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓవ్యక్తి బనియన్లో బంగారాన్ని దాచుకొని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని విలువ దాదాపు రూ.40 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.