యువతిపై లైంగిక వేధింపులు.. ఇద్దరు అధ్యాపకులపై కేసు

యువతిపై లైంగిక వేధింపులు.. ఇద్దరు అధ్యాపకులపై కేసు

మాదాపూర్: న‌గ‌రంలో మాదాపూర్‌లో మ‌రో యువతిపై లైంగిక దాడి జ‌రిగింది. ఇద్దరు అధ్యాపకులు త‌న‌పై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డార‌ని మాదాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. గత నెల 24వ తేదిన జ‌రిగిన ఈ ఘటన ఆలస్యంగా బ‌య‌ట‌ప‌డింది. నగరంలోని రాంనగర్ కళాశాలలో చదువుతున్న యువతి త‌న వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణ్ వర్మ ఇంట్లో విందుకి వెళ్లింది. త‌న సోద‌రుడితో క‌లిసి గత నెల 24వ తేది మాదాపూర్‌లోని కళ్యాణ్ వ‌ర్మ ఇంటికి వెళ్ల‌గా.. ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి, వైస్ ప్రిన్సిప‌ల్, మ‌రో లెక్చ‌ర‌ర్ ర‌వీంద‌ర్ లు క‌లిసి త‌నను లైంగికంగా వేధించార‌ని బాధితురాలు తెలిపింది. విందు పేరిట ఆహ్వానించి తన పట్ల అనుచితంగా ప్రవర్తించార‌ని ఈ నెల 9వ తేదీన మాదాపుర్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.