మస్కిటో లిక్విడ్ తాగేసిన చిన్నారి.. చందానగర్ లో జరిగిన ఘోరం..

మస్కిటో లిక్విడ్ తాగేసిన చిన్నారి.. చందానగర్ లో జరిగిన ఘోరం..

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున చందానగర్ లో విషాదం.. ఏడాదిన్నర వయస్సు ఉన్న జాకీర్ అనే చిన్నారి.. ఆడుకుంటూ ఆడుకుంటూ దోమల మందు తాగేశాడు. ఇంట్లో దొమలను చంపటానికి పెట్టుకున్న లిక్విడ్ బాటిల్ తో ఆడుకుంటూ.. నోట్లో పెట్టుకుని తాగేశాడు. చిన్నారి ఏడుస్తుండటంతో.. ఎత్తుకున్న తల్లిదండ్రులకు మస్కిటో లిక్విడ్ వాసన వచ్చింది. అదే సమయంలో బాటిల్ లోని లిక్విడ్ కూడా తక్కువగా ఉంది. అసలు విషయం తెలిసి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. 

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్ లో ఏప్రిల్ 8వ తేదీన ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రమాద వశాత్తు జరిగిందా లేక బాలుడి మరణంలో మరో కోణం ఏమైనా ఉందా అనే విషయంపై పేరంట్స్ ను విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో అయితే.. చిన్నారి ఆడుకుంటూ మస్కిటో లిక్విడ్ తాగాడనేది స్పష్టం అయ్యిందన్నారు పోలీసులు. పూర్తి విచారణ జరుగుతుందని తెలిపారు.