సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడిన కానిస్టేబుల్ 

సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడిన కానిస్టేబుల్ 
  • ముంబై జుహూ బీచ్​లో ఘటన.. సోషల్​ మీడియాలో వీడియో వైరల్

ముంబై: ఓ కానిస్టేబుల్ సరైన సమయంలో స్పందించి ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడారు. సముద్రపు ఆలలకు కొట్టుకపోతున్న పిల్లల్ని ధైర్యంగా రక్షించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. మహారాష్ట్రలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో విష్ణు భావ్రావ్ బేలే కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం విష్ణు జుహూలోని కోలివాడ జుహు బీచ్​కు వెళ్లారు.

అదే టైంలో సమీర్ పవార్(10), భీమ్ కాలే(7) బీచ్​లోని జుహు కోలివాడ ల్యాండింగ్ పాయింట్ ఎండ్ నుంచి ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత బలంగా వచ్చిన ఆలల్లో చిక్కుకున్నారు. పిల్లల పరిస్థితిని గమనించిన విష్ణు వెంటనే సముద్రంలోకి వెళ్లారు. మునిగిపోతున్న వారిద్దరి రక్షించారు. తర్వాత  పిల్లలిద్దరినీ వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ముంబై పోలీసులు తెలిపారు.