రూ.12 వేల అప్పు తీర్చలేదని తల్లిని చంపేసింది

రూ.12 వేల అప్పు తీర్చలేదని తల్లిని చంపేసింది

పిట్లం: ఇచ్చిన అప్పు తీర్చలేదన్న కోపంతో తల్లిని కూతురు హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుం ద మండలంలో జరిగింది. సీఐ సాజీద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం దౌల్తాపూర్ కు చెందిన బాయవ్వ(70)కు ఆమె కూతురు బాయవ్వ రూ. 12 వేలు అప్పుగా ఇచ్చింది.ఆదివారం పుట్టింటికి వచ్చిన కూతురు తన అప్పు తీర్చాలంటూ తల్లిదండ్రులతో గొడవకు దిగింది. మాటామాట పెరిగి తోసుకోవడంతో తల్లి కింద పడిపోయింది. కూతురు కోపంతో రాయితో కొట్టడంతో తల్లి అక్కడి కక్కడే మృతి చెందింది.