మద్యం మత్తులో బిల్డింగ్ పై నుంచి జారీ పడిన భక్తుడు...

మద్యం మత్తులో బిల్డింగ్ పై నుంచి జారీ పడిన భక్తుడు...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో బిల్లింగ్ నుండి జారీ పడిన వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న గుడికి దర్శనం కోసం వరంగల్ జిల్లాకి చెందిన రవీందర్ కుటుంబం వచ్చింది. దర్శనం అనంతరం రవీందర్ కుటుంబం దేవస్థాన సన్నిధిలోని నందీశ్వర కాంప్లెక్స్ మొదటి అంతస్తులో బస చేశారు. 

అక్కడే మద్యం సేవించిన రవీందర్ మొదటి అంతస్తు నుంచి జారీ కింద పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.