మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజులరామారంలో సైకో బీభత్సం సృష్టించాడు. అర్థరాత్రి వివేకానంద నగర్ ప్రాంతంలో పలు ఇండ్లమ ముందు పార్క్ చేసిన బైకులు, ఆటోను సైకో పరమేశ్వర్ (24) తగులబెట్టాడు. వాహనాల నుంచే పెట్రోల్ తీసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో 15 బైకులు, ఒక ఆటో పూర్తిగా దగ్ధమైంది.
దట్టమైన పొగ..
అర్థరాత్రి 2 గంటల 30 నిమిషాలకు వాహనాలకు పరమేశ్వర్ నిప్పటించడంతో ఆ ప్రాంతమంతా పొగ అలుముకుంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు.. వాహనాలు తగలబడుతున్న విషయాన్ని గమనించారు. నీటితో ఆర్పేసే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరమేశ్వర్ సైకో...
గాజులరామారంలోని రొడామేస్త్రి నగర్, NLB నగర్ ప్రాంతంలో నివాసముండే పరమేశ్వర్ ఈ ఘటనకు పాల్పడినట్లు జీడిమెట్ల సీఐ పవన్ తెలిపారు. జులాయిగా తిరిగే అతను ఇతరులతో గొడవ పడుతుంటాడని చెప్పారు. పరమేశ్వర్ సైకోగా ప్రవర్తిస్తాడని స్దానికులు వెల్లడించారన్నారు. సిసి పుటేజ్ ఆధారంగా నిందితుడిని కోసం గాలిస్తున్నామన్నారు.