లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు

లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు

చెన్నై : లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు చెలరేగాయి. చెన్నై బేసిన్‌ బ్రిడ్జ్‌ వద్ద రైలు ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బోగీల నుంచి భయంతో పరుగులు తీశారు. చెన్నై నుంచి ముంబయి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైఓల్టేజీ విద్యుత్‌ లైన్‌పై ఇంజిన్‌ రాపిడికి గురవడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. పెనుప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.