
హైదరాబాద్: ఉప్పల్ బస్టాప్ వద్ద యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధిత యువతికి స్వల్ప గాయాలయ్యాయి. భువనగిరి చెందిన సాయికుమార్, అతని ప్రేమికురాలు ఇద్దరూ విద్యార్థులు. సిటీలో చదువుకుంటున్న ఈ ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ప్రస్తుతం విడిపోయి ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరూ గురువారం (సెప్టెంబర్ 26, 2024) చాలా రోజుల తర్వాత ఉప్పల్ బస్టాప్ దగ్గర కలుసుకున్నారు. కొద్దిసేపు మంచిగానే మాట్లాడుకున్నారు.
ALSO READ | బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో నటుడు అభిషేక్ అరెస్ట్
ఏం జరిగిందో తెలియదు గానీ ఇరువురికి మాటామాటా పెరిగింది. ‘‘నన్ను ప్రేమించాలి’’ అంటూ అమ్మాయిపై సదరు యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి గాయమైంది. చికిత్స నిమిత్తం యువతిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.