వరంగల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇంటి కోసం ట్యాంక్ ఎక్కిండు..!

వరంగల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇంటి కోసం ట్యాంక్ ఎక్కిండు..!

పర్వతగిరి, వెలుగు: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వరంగల్​జిల్లాలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు.  దౌలత్​నగర్​శివారులోని చెరువు కొమ్ము తండాకు చెందిన సుమన్ సోమవారం తండాలోని వాటర్​టాంక్​ఎక్కాడు. ఇల్లు ఇచ్చే దాకా దిగనని, లేదంటే దూకుతాననని బెదిరించాడు. అనర్హులకు ఇండ్లు ఇస్తున్నారని, తన ఇల్లు కాలిపోయి చాలా రోజులు అయితుందని, అయినా ఇవ్వడంలేదని వాపోయాడు. సమాచారం అందడంతో పోలీసులు, ఫైర్​సిబ్బంది వెళ్లి సుమన్‎కు నచ్చ చెప్పి కిందికి దించారు. సుమారు​గంటసేపు తండాలో టెన్షన్​వాతావరణం నెలకొంది.