
పర్వతగిరి, వెలుగు: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వరంగల్జిల్లాలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. దౌలత్నగర్శివారులోని చెరువు కొమ్ము తండాకు చెందిన సుమన్ సోమవారం తండాలోని వాటర్టాంక్ఎక్కాడు. ఇల్లు ఇచ్చే దాకా దిగనని, లేదంటే దూకుతాననని బెదిరించాడు. అనర్హులకు ఇండ్లు ఇస్తున్నారని, తన ఇల్లు కాలిపోయి చాలా రోజులు అయితుందని, అయినా ఇవ్వడంలేదని వాపోయాడు. సమాచారం అందడంతో పోలీసులు, ఫైర్సిబ్బంది వెళ్లి సుమన్కు నచ్చ చెప్పి కిందికి దించారు. సుమారుగంటసేపు తండాలో టెన్షన్వాతావరణం నెలకొంది.