టీఆర్‌‌ఎస్ ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్‌ షాక్‌.. యువకుడి మృతి

టీఆర్‌‌ఎస్ ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్‌ షాక్‌.. యువకుడి మృతి

టీఆర్‌‌ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన ధర్నా కోసం.. నిన్న అర్ధరాత్రి  ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మరణించాడు. సూర్యాపేట జిల్లా కోదాడలోని రంగా థియేటర్ దగ్గర ఫ్లెక్సీలు కడుతుండగా బంజార కాలనీకి చెందిన కందుకూరి సునీల్ అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో చనిపోయాడు. వెంకటేష్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఫ్లెక్సీలు కట్టేందుకు సునీల్ ను తీసుకెళ్లిన వ్యక్తి ప్రమాదం జరిగితే పట్టించుకోలేదంటున్నారు మృతుడి బంధువులు, స్నేహితులు. విద్యుత్ షాక్‌ తగిలిన వెంటనే ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించి ఉంటే సునీల్ బతికేవాడన్నారు. సునీల్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.