
కరోనా టీకా తెచ్చి ఇంటిదగ్గరే వేస్తానంటూ నమ్మబలికి.. వృద్ధ దంపతులకు మత్తు మందిచ్చి బంగారం చోరీ చేసింది ఓ నర్సు. వృద్ధ దంపతుల దగ్గర 8తులాల బంగారు నగలు కాజేసి పారిపోయింది. హైదరాబాద్ మీర్ పేట్ లోని లలితానగర్ కు చెందిన కస్తూరి, లక్ష్మణ్ దంపతులకు.. అనూష అనే నర్సు కరోనా టీకా ఇస్తానని చెప్పింది. స్థానికంగా ఉండే నర్సే కావటంతో దంపతులు నమ్మారు. తీరా టీకా పేరుతో మత్తు మందిచ్చి 8 తులాల బంగారం కాజేసింది అనూష.
వృద్ధ దంపతుల దగ్గర బంగారం కాజేయాలని గతంలోనే ప్లాన్ చేసింది నర్సు అనూష. మొదటిసారి పాయసంలో మత్తుమందు కలిపి ఇచ్చింది. అయితే వృద్ధ దంపతులకు షుగర్ ఉండటంతో పాయసం పారబోశారు. అప్పుడు కుదరకపోవటంతో.. ఈసారి కరోనా వాక్సినేషన్ పేరుతో ప్లాన్ చేసింది. టీకా పేరు చెప్పి బంగారం కాజేసినట్లు పోలీసులు చెప్పారు. అనూషను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. బంగారం రికవరీ చేశామన్నారు.