- ప్యాసింజర్ అరెస్ట్
శంషాబాద్, వెలుగు : బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్యాసింజర్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గురువారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఓ ప్యాసింజర్ బంగారాన్ని పౌడర్గా మార్చి తీసుకొచ్చాడు.
అతడి ప్యాంట్ జేబులో ఆ పౌడర్ను గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 552 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.33 లక్షల 53 వేలు ఉంటుందని అంచనా వేశారు. ప్యాసింజర్ పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.